ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Nov 25, 2020, 8:52 PM IST

ETV Bharat / state

వివాహిత ఆత్మహత్య... భర్తపై బంధువుల ఫిర్యాదు

హిందూపురంలో ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుంది. ఇంట్లో ఉరి వేసుకొని ఈ అఘాయిత్యానికి పాల్పడింది. హర్షియా మరణానికి ఆమె భర్తే కారణమని బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

వివాహిత ఆత్మహత్య
వివాహిత ఆత్మహత్య

వివాహిత ఆత్మహత్య

అనంతపురం జిల్లా హిందూపురం ఆర్టీసీ కాలనీకి చెందిన నూరుల్లా.. చికాగోలో సాప్ట్​వేర్ ఇంజనీర్​గా పనిచేస్తున్నాడు. సంవత్సరంన్నర క్రితం అతనికి మడకశిరకు చెందిన హర్షియతో వివాహం జరిగింది. రెండు నెలల క్రితం నూరుల్లా చికాగో వెళ్లిపోయాడు. తన మూడు నెలల కుమారున్ని తల్లి దండ్రుల దగ్గర ఉంచి హర్షియా కర్ణాటకలోని తుమూకూరు మెడికల్ కళాశాలలో మెడిసిన్ కొనసాగిస్తోంది. పది రోజుల క్రితం చికాగో నుంచి తిరిగి వచ్చిన నూరుల్లా.. భార్య హర్షియా, కుమారున్ని హిందూపురం తీసుకువచ్చాడు.

అయితే గత రాత్రి భర్త ఇంట్లో హర్షియా ఉరివేసుకోని ఆత్మహత్యకు పాల్పడింది. దీంతో ఆగ్రహించిన మృతురాలి బంధువులు ఇంట్లోని ఫర్నిచర్ ధ్వంసం చేశారు. వారు మాట్లాడుతూ.. భర్తే తరచూ వేధించేవాడని.. చదువు మానేయాలని ఒత్తిడికి గురిచేసేవాడని, అదనపు కట్నం కోసం తరచూ ఫోన్ చేసేవాడని ఆరోపించారు. గత రాత్రి కూడా వారిద్దరి మధ్య ఇదే విషయమై వివాదం జరిగిందని తెలిపారు. తమ బిడ్డను హత్య చేసి.. ఆత్మహత్య గా చిత్రీకరిస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని శవపరీక్ష నిమిత్తం మృతదేహాన్ని హిందూపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

ABOUT THE AUTHOR

...view details