ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అనంతలో రెండు లక్షల శానిటైజర్లు పంపిణీ - sanitizers distribution news in ananthapuram

అనంతపురంలో వైకాపా నేత మహాలక్ష్మీ శ్రీనివాస్, ఎమ్మెల్సీ గోపాల్​ రెడ్డితో కలిసి ఇంటింటికి శానిటైజర్స్, మాస్కులు పంపిణీ చేశారు. కరోనా బారిన పడకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను నేతలు స్థానికులకు వివరించారు.

అనంతలో రెండు లక్షల శానిటైజర్లు పంపిణీ
అనంతలో రెండు లక్షల శానిటైజర్లు పంపిణీ

By

Published : Apr 15, 2020, 11:02 AM IST

ముఖ్యమంత్రి జగన్మోహన్​ రెడ్డి పిలుపుమేరకు అనంతపురంలో వైకాపా నేత మహాలక్ష్మి శ్రీనివాస్, ఎమ్మెల్సీ గోపాల్ రెడ్డితో కలిసి ఇంటింటికీ శానిటైజర్లు, మాస్కులు పంపిణీ చేశారు. నగరంలో సుమారు 2 లక్షల శానిటైజర్లు పంపిణీ చేయనున్నట్లు నేతలు తెలిపారు. మొదటి విడతలో భాగంగా 25వ డివిజన్​లో పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు వివరించారు. లాక్​డౌన్​ పూర్తయ్యేవరకు తమ వంతు బాధ్యతగా ప్రజలకు నిత్యావసర సరుకులు అందిస్తామని చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details