ఆంధ్రప్రదేశ్

andhra pradesh

గంజాయి విక్రయానికి యత్నించిన వ్యక్తి అరెస్ట్

By

Published : Apr 5, 2021, 8:38 PM IST

గంజాయి విక్రయానికి యత్నిస్తున్న ఓ వ్యక్తిని కదిరి పోలీసులు అరెస్ట్ చేశారు. అతని నుంచి సుమారు కిలోన్నర గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.

గంజాయిని విక్రయించేందుకు ప్రయత్నిస్తున్న వ్యక్తిని చూపుతున్న పోలీసులు
గంజాయిని విక్రయించేందుకు ప్రయత్నిస్తున్న వ్యక్తిని చూపుతున్న పోలీసులు

అనంతపురం జిల్లా కదిరిలో గంజాయిని విక్రయించేందుకు యత్నిస్తున్న ఓ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. పట్టణంలోని జడలయ్య మండపం ప్రాంతానికి చెందిన శ్రీనివాసులు గంజాయి విక్రయిస్తున్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అతని నుంచి సుమారు కిలోన్నర గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు సీఐ శ్రీనివాసులు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details