ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గోరంట్లలో అనిశా దాడి.. లంచం తీసుకుంటుండగా వీఆర్వో అరెస్ట్ - లంచం తీసుకుంటున్న మందలపల్లి వీఆర్వోను అరెస్ట్ చేసిన అనిశా అధికారులు

భర్త పేరున ఉన్న భూమిని భార్యకు బదలాయించడానికి లంచం అడిగిన వీఆర్వో చంద్రమౌళిని అనిశా అధికారులు అరెస్ట్ చేశారు. అనంతపురం జిల్లా గోరంట్లలో జరిగిందీ ఘటన.

acb arrested mandalapalli vro while taking bribe
లంచం తీసుకుంటున్న మందలపల్లి వీఆర్వో అరెస్ట్

By

Published : Feb 18, 2021, 4:51 PM IST

అనంతపురం జిల్లా గోరంట్ల తహసీల్దార్ కార్యాలయంలో వీఆర్వోగా పనిచేస్తున్న ఆర్.చంద్రమౌళిని అనిశా అధికారులు అరెస్ట్ చేశారు. మందలపల్లికి చెందిన ఓ రైతు నుంచి ఈరోజు మధ్యాహ్నం రూ.10 వేలు లంచం తీసుకుంటుండగా.. సిబ్బందితో కలిసి అనిశా డీఎస్పీ కులశేఖర్ రెడ్ హ్యాండెడ్​గా పట్టుకున్నారు.

శ్రీనివాసులు అనే వ్యక్తి రెండేళ్ల క్రితం మరణించగా.. అతని పేరు మీదనున్న 2.26 ఎకరాల భూమిని తనకు బదలాయించాలని కోరుతూ భార్య భువనేశ్వరి పలుమార్లు అర్జీ పెట్టుకున్నట్లు అనిశా సిబ్బంది తెలిపారు. సంబంధిత అధికారులు స్పందించకపోగా.. రూ.20వేలు లంచం ఇవ్వాలని బాధితురాలిని మందలపల్లి వీఆర్వో చంద్రమౌళి డిమాండ్ చేశాడని వెల్లడించారు. ఆమె కుమారుడు వెంకటశివ అనిశాకు సమాచారం ఇచ్చారని చెప్పారు. గోరంట్లలో వీఆర్వో రూ.10వేలు తీసుకునే సమయంలో అరెస్ట్ చేసినట్లు పేర్కొన్నారు. నగదును సీజ్ చేశామని.. నిందితుడిని కోర్టులో హాజరు పరుస్తామని డీఎస్పీ వివరించారు.

ABOUT THE AUTHOR

...view details