Road Accident In Anantapur: అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గంలోని గుమ్మగట్ట మండలం మరెంపల్లి వద్ద జాతీయ రహదారి పై ఈ ప్రమాదం జరిగింది. ఈ రోడ్డు ప్రమాదంలో కర్ణాటక రాష్ట్రం మొలకాల్మురుకు చెందిన ట్రాక్టర్ డ్రైవర్ గురుమూర్తి అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యాడు. మరొక వ్యక్తి మహేష్ తీవ్ర గాయాలయ్యాయి. రాయదుర్గం వైపు నుంచి కళ్యాణదుర్గం పట్టణానికి ఇటుకల లోడ్తో వెళుతున్న ట్రాక్టర్ను వీఆర్ఎల్ పార్సల్ సర్వీస్ లారీ వెనుక నుంచి వేగంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో ట్రాక్టర్ బోల్తా పడి నుజ్జునుజ్జయింది. ప్రమాద ధాటికి ట్రాక్టర్, లారీ రెండు ధ్వంసమయ్యాయి. ప్రమాదం అనంతరం లారీ డ్రైవర్ అక్కడి నుంచి పరారయ్యాడు. రాయదుర్గం రూరల్ సీఐ, గుమ్మగట్ట ఎస్సై ఏ సునీత ప్రమాద స్థలాన్ని సందర్శించి జాతీయ రహదారిలో రాకపోకలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు చేపట్టారు. మృతుడు గురుమూర్తి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ట్రాక్టర్ను ఢీకొట్టిన లారీ.. డ్రైవర్ మృతి.. - రాయదుర్గం రోడ్డు ప్రమాదం
Accident: ఇటుకల లోడ్తో వెళ్తున్న ట్రాక్టర్ను వెనక వైపు నుంచి లారీ వేగంగా వచ్చి ఢీ కొట్టింది. లారీ ఢీకొట్టిన వేగానిగి వెంటనే ట్రాక్టర్ పల్టీ కొట్టింది. ఈ ప్రమాదంలో ట్రాక్టర్ డ్రైవర్ అక్కడిక్కడే మృతి చెందగా, మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ఇంతకీ ఈ ప్రమాదం ఎక్కడ జరిగిందంటే..
Etv Bharat