ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Feb 23, 2022, 9:59 AM IST

Updated : Feb 23, 2022, 10:46 AM IST

ETV Bharat / state

Accident : అనంతపురం జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి

accident
accident

09:57 February 23

మరమ్మతుకు గురైన మినీ లారీని మరో వాహనంతో తీసుకెళ్తుండగా ఘటన

accident: అనంతపురం జిల్లా రాప్తాడు సమీపంలో తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్ర గాయాలైన మరొకరిని అనంతపురం ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ చనిపోయారు.

కియా ఫ్యాక్టరీ వద్ద బొలెరో వాహనం మరమ్మతుకు గురవగా...దాన్ని మరో వాహనంతో అనంతపురం తీసుకొస్తున్నారు. రాప్తాడు రైస్ మిల్లు వరకు రాగానే గుర్తుతెలియని వాహనం.. ఈ రెండు వాహనాలను ఢీ కొట్టింది. బొలెరో వాహనాలలో ఉన్న డ్రైవర్లు మల్లికార్జున, పవన్ అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్రగాయాలైన ద్వారకేశ్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయినట్లు పోలీసులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేపట్టారు.

ఇదీ చదవండి:

ద్విచక్రవాహనాలు ఢీ.. ఇద్దరు మృతి

Last Updated : Feb 23, 2022, 10:46 AM IST

ABOUT THE AUTHOR

...view details