అనంతపురం నగరంలోని శ్మశానవాటికలో దారుణం చోటుచేసుకుంది. సగం కాలిన గుర్తు తెలియని మృతదేహం స్థానికులను ఆందోళనకు గురి చేసింది. ఈ ఘటనపై స్థానికులు అనుమానం వ్యక్తం చేశారు. మృతి చెందిన వ్యక్తిని కాల్చి తీసుకువచ్చి హిందూ శ్మశాన వాటికలో పడేశారా? పూడ్చే ఓపిక లేక అలా పడేసారా? అని అనుమానాలు వ్యక్తం చేశారు.
శ్మశానంలో సగం కాలిన మృతదేహం... పరుగులు తీసిన స్థానికులు - Anantapur latest news
అనంతపురం నగరంలోని ఓ శ్మశాన వాటిలో సగం కాలిన మృతదేహం కలకలం రేపింది. మృతదేహాన్ని చూసిన ప్రజలు భయంతో పరుగులు తీశారు. ఈ ఘటనపై స్థానికులు పలు అనుమానాలు వ్యక్తం చేశారు.
![శ్మశానంలో సగం కాలిన మృతదేహం... పరుగులు తీసిన స్థానికులు half a burnt body](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-13254251-929-13254251-1633334175129.jpg)
half a burnt body
వచ్చే అమావాస్యకు పెద్దల పండుగ ఉండటంతో జనం సమాధుల చుట్టూ ముళ్ల పొదలు తొలగించేందుకు చర్యలు చేపట్టారు. ఈ సమయంలో సగం కాలిన వ్యక్తి మృతదేహాన్ని చూసి భయంతో పరుగులు తీశారు. ఘటనపై పోలీసులకు సమాచారం ఇచ్చినా.. స్పందించక పోవటంతో స్థానికులే కాటి కాపరితో మృతదేహాన్ని పూడ్చివేశారు.
ఇదీ చదవండి:ప్రమాదవశాత్తు చెరువులో పడి బీటెక్ విద్యార్థి మృతి