ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'రాయలసీమ సంస్కృతి ప్రతిబింబించేలా లేపాక్షి వైభవం' - Lepakshi Vaibhavam 2020 news

రాయలసీమ జీవన శైలిని తెలిపేలా లేపాక్షి వైభవం 2020 ఉత్సవాలను నిర్వహించబోతున్నట్లు అనంతపురం కలెక్టర్ గంధం చంద్రుడు పెర్కొన్నారు. విజయవాడ కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో సమావేశమైన ఆయన... లేపాక్షి వైభవానికి సంబంధించిన పోస్టర్లను పర్యటక శాఖ ఎండీ ప్రవీణ్ కుమార్​తో కలిసి ఆవిష్కరించారు.

లేపాక్షి వైభవం 2020 ఉత్సవాల పోస్టర్లు విడుదల
లేపాక్షి వైభవం 2020 ఉత్సవాల పోస్టర్లు విడుదల

By

Published : Mar 4, 2020, 10:30 PM IST

రాయలసీమ సంస్కృతిని ప్రతిబింబించేలా లేపాక్షి ఉత్సవాలు

లేపాక్షి ఉత్సవాలను వైభవంగా నిర్వహించబోతున్నామని అనంతపురం కలెక్టర్​ తెలిపారు. సంస్కృతి అనే అంశం ఆధారంగా వేడుకలు జరుగుతాయన్నారు. ఈ నెల 7, 8వ తేదీల్లో జరిగే ఉత్సవాల్లో రెండు లక్షలకు పైగా పర్యాటకులు పాల్గొంటారని అంచనా వేశారు. రాయలసీమ సంస్కృతి సంప్రదాయాలను చాటి చెప్పటం.. ప్రత్యేక వంటకాలు అందుబాటులో ఉంచడం వంటివి ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయన్నారు. పర్యటక శాఖ ఎండీ ప్రవీణ్ కుమార్​తో కలిసి లేపాక్షి పోస్టర్లను విడుదల చేశారు.

ప్రభుత్వం ఉత్సవాల కోసం కోటి రూపాయలు విడుదల చేయగా.... మరిన్ని నిధుల కోసం విజ్ఞప్తి చేసినట్లు పర్యటక శాఖ ఎండీ ప్రవీణ్ కుమార్ తెలిపారు. కరోనా వార్తల నేపథ్యంలో.. ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. వైద్య సిబ్బందిని అందుబాటులో ఉంచి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తున్నట్లు వివరించారు.

ABOUT THE AUTHOR

...view details