ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గుంతకల్ రైల్వే స్టేషన్​లో.. అత్యాధునిక థర్మల్ స్క్రీనింగ్! - గుంతకల్ రైల్వే స్టేషన్

అనంతపురం జిల్లా గుంతకల్ రైల్వే స్టేషన్​ ప్రవేశ ద్వారం వద్ద అత్యాధునిక థర్మల్ స్క్రీనింగ్ పరికరాన్ని అమర్చారు. ప్రయాణికులు స్టేషన్​లోకి ప్రవేశించే సమయంలో వారి శరీర ఉష్ణోగ్రతను గుర్తించి హెచ్చరించడం దీని ప్రత్యేకత.

thermal screening in guntakal railway station
గుంతకల్ రైల్వే స్టేషన్​లో థర్మల్ స్క్రీనింగ్

By

Published : May 1, 2021, 9:13 PM IST

కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో.. అనంతపురం జిల్లా గుంతకల్ రైల్వే అధికారులు అత్యాధునిక థర్మల్ స్క్రీనింగ్ ఏర్పాటు చేశారు. ప్రయాణికుల ఆరోగ్య భద్రత దృష్ట్యా.. రైల్వే స్టేషన్ ప్రవేశ ద్వారం వద్ద ఈ పరికరాన్ని అమర్చారు.

ఇదీ చదవండి:పెళ్లైన మూడు రోజులకే కరోనాతో వరుడు మృతి

ఇందులోని కెమెరా.. ప్రయాణికుడిని ఫొటో తీస్తుంది. పక్కనే ఉన్న థర్మల్ స్క్రీనింగ్ యంత్రం.. ఆ వ్యక్తి శరీర ఉష్ణోగ్రతను ప్రత్యేకంగా అమర్చిన కంప్యూటర్ స్క్రీన్​పై చూపిస్తుంది. ఒకవేళ ఉష్ణోగ్రత అధికంగా ఉంటే ఫొటోపై చూపిస్తూ.. అలారం మోగుతుంది. ప్రవేశ ద్వారం వద్ద విధులు నిర్వర్తించే రైల్వే సిబ్బంది.. అతడిని స్టేషన్​లోకి రాకుండా క్షుణ్నంగా పరిశీలిస్తారు. అన్నీ సక్రమంగా ఉంటేనే ప్రయాణానికి అనుమతిస్తారు.

ఇదీ చదవండి:

ఐపీఎల్ బెట్టింగ్​ రాయుళ్లు అరెస్ట్​.. రూ. 55 వేలు స్వాధీనం

ABOUT THE AUTHOR

...view details