అనంతపురం జిల్లా యాడికి మండల కేంద్రంలో.. ఎమ్మెల్యే పెద్దారెడ్డికి ఓ మహిళ షాక్ ఇచ్చింది. నవరత్నాల హామీల్లో భాగంగా ఇళ్ల పట్టాల పంపిణీకి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
మండలంలోని 541 మందికి స్థలాలు అందజేసే క్రమంలో.. మీకు ఇంటి పట్టా ఎవరిస్తున్నారు అని ఓ మహిళను ఆయన అడిగారు. చంద్రన్న ఇస్తున్నాడని సదరు మహిళ జవాబు చెప్పడంతో.. అక్కడున్న అధికారులతా ఒక్క క్షణం ఆశ్చర్యపోయారు. ఇళ్ల పట్టాలు ఇస్తోంది చంద్రన్న కాదు... జగనన్న అని ఆమెకు తెలియజేయాల్సి వచ్చింది.