అనంతపురం జిల్లాను తాగునీటి సమస్య నానాటికి వెంటాడుతూనే ఉంది. సాగునీటికే కాదు...కనీసం తాగునీటికి కూడా నోచుకోలేకపోతున్నారు ఆ ప్రాంత ప్రజలు. తాజాగా జిల్లాలోని మరువపల్లి కాలనీలో నెలరోజులుగా తాగుటానికి చుక్కనీరు లేక తీవ్ర ఇబ్బందులు పడుతుంటే.. అరకొరగా ట్యాంకర్లతో సరఫరా చేయడాన్ని నిరసిస్తూ తహసీల్దార్ కార్యాలయం ఎదుట పెనుకొండ-పావగడ రహదారిపై బైఠాయించి ఆందోళన చేపట్టారు.
అనంతలో తాగునీటి కోసం మహిళల ధర్నా - అనంతపురం జిల్లా
తాగునీటి కోసం మహిళలు రోడ్డెక్కారు. నెల రోజులుగా నీటి సమస్యతో ఇబ్బందులు పడుతున్నా పట్టించుకోలేదని ఖాళీ బిందెలతో నిరసన తెలిపారు. ఈ ఘటన అనంతపురం జిల్లా రొద్దం మండలం మరువపల్లి ఎస్సీ కాలనీలో జరిగింది.

మహిళల ధర్మా తాగునీటికోసం