ఆంధ్రప్రదేశ్

andhra pradesh

లారీలో ఆకస్మాత్తుగా మంటలు

అనంతపురం శివారులోని కళ్యాణదుర్గం బైపాస్ రోడ్డులో వెళ్తున్న లారీలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన డ్రైవర్ వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందిచాడు. వారు వెంటనే అక్కడికి చేరుకుని మంటను ఆర్పివేశారు. డ్రైవర్ అప్రమత్తతతో ఉండడం వల్ల పెద్ద ప్రమాదం తప్పింది.

By

Published : Jul 12, 2021, 9:53 AM IST

Published : Jul 12, 2021, 9:53 AM IST

laary_vehicle_fire_accident
లారీలో ఆకస్మాత్తుగా మంటలు

అనంతపురం నుంచి బెంగళూరుకి బొప్పాయి లోడుతో వెళ్తున్న లారీ.. రాత్రి రెండుగంటల సమయంలో అనంతపురం శివారు ప్రాంతం కళ్యాణదుర్గం బైపాస్ రోడ్డుకు చేరుకుంది ఆ సమయంలోనే వాహనం నుంచి మంటలు వస్తున్న విషయాన్ని డ్రైవర్ గమనించాడు. వాహనాన్ని పక్కన నిలిపివేశాడు.పెద్దఎత్తున మంటలు చెలరేగడంతో వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఫైర్ సిబ్బంది సకాలంలో చేరుకుని మంటలను అదుపు చేశారు. వాహనంలోని బ్యాటరీ షాట్ సర్క్యూట్ వల్ల ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. బొప్పాయి పండ్లు కాలిపోయి రెండు లక్షల వరకు నష్టం ఉంటుందని డ్రైవర్ తెలిపాడు. మంటల వల్ల వాహనానికి ఎటువంటి నష్టం జరగలేదు, సకాలంలో వచ్చిన ఫైర్ సిబ్బందికి లారీ యజమానులు, స్థానికులు కృతజ్ఞతలు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details