ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Oct 20, 2020, 9:56 PM IST

ETV Bharat / state

రైతులకు పెట్టుబడి సహాయం అందించాలి: కిసాన్​ మోర్చా

రైతులకు పెట్టుబడి సాయం అందించాలంటూ కిసాన్​ మోర్చా నాయకులు డిమాండ్​ చేశారు. కళ్యాణదుర్గం ప్రాంతంలో పర్యటించి రైతుల పెట్టుబడుల గురించి ఆరా తీశారు.

kisan morcha leaders visits kalyanadurgam
రైతులను కలిసిన కిసాన్​ మోర్చా నాయకులు

కళ్యాణదుర్గం ప్రాంతంలో పలు పంట పొలాలను జిల్లా కిసాన్​ మోర్చా నాయకులు పర్యటించారు. జిల్లాలో ప్రధాన వర్షాధార పంట అయిన వేరుశనగ... అధిక వర్షాలకు తీవ్రంగా దెబ్బతిందని రైతులు వాపోయారు. అతివృష్టి కారణాలతో అప్పుల ఊబిలో కూరుకుపోతున్న జిల్లా రైతాంగాన్ని ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని డిమాండ్​ చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర కిసాన్​ మోర్చా నాయకుడు శశి భూషణ్​ రెడ్డి, జిల్లా కిసాన్​ మోర్చా అధ్యక్షుడు శ్రీనివాసులు పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details