ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కళ్యాణదుర్గంలో కిడ్నాప్ కలకలం.. స్కూటీ నెంబర్ ఆధారంగా దర్యాప్తు - today kidnapping in kalyanadurgam latest news update

కళ్యాణదుర్గం శివార్లలో ఓ వ్యక్తిని కిడ్నాప్ చేసిన ఘటన కలకలం రేపుతోంది. స్కూటీపై వెళ్తున్న వ్యక్తిని.. కారులో వచ్చిన కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు బలవంతంగా తీసుకెళ్లినట్లు.. ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. సీఐ సిబ్బందితో కలిసి సంఘటన స్థలానికి చేరుకొని.. స్కూటీ నెంబర్ ఆధారంగా వివరాలు సేకరిస్తున్నారు.

Kidnapping scandal in Kalyanadurgam
కళ్యాణదుర్గంలో కిడ్నాప్ కలకలం

By

Published : May 19, 2021, 12:56 PM IST

అనంతపురం జిల్లా కల్యాణదుర్గం శివార్లలో ఓ వ్యక్తి కిడ్నాప్ కలకలం రేకెత్తించింది. బైపాస్ రోడ్డులో స్కూటీపై వెళ్తున్న ఒకరిని.... కొందరు గుర్తుతెలియని వ్యక్తులు బలవంతంగా కారులో ఎక్కించుకుని తీసుకెళ్లినట్టు ప్రత్యక్ష సాక్షులు చెప్పారు.

ఆ కారు.. మారుతి స్విఫ్ట్‌ అని, దానికి నంబర్‌ ప్లేట్ లేదని పోలీసులకు వివరించారు. వారు రాయదుర్గం వైపు వెళ్లినట్టు చెబుతున్నారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు.... కిడ్నాప్‌నకు గురైన వ్యక్తి స్కూటీ నంబర్ ఆధారంగా వివరాలు సేకరిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details