ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : May 19, 2021, 7:33 PM IST

ETV Bharat / state

కొవిడ్‌ నివారణ, సహాయ చర్యలకు కియా ఇండియా సాయం

కొవిడ్‌ నివారణ, సహాయ చర్యలకు కియా ఇండియా సాయం చేసింది. రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థకు రూ.5 కోట్లు విరాళం ఇచ్చింది. విరాళ చెక్కులను కియా ఇండియా ఎండీ, సీఈవో షిమ్‌.. సీఎం జగన్​కు అందించారు. విరాళం నగదుతో వైద్య పరికరాలు కొనుగోలు చేయాలని కియా కోరింది.

కియా ఇండియా సాయం
కియా ఇండియా సాయం

కొవిడ్‌ నివారణ, సహాయ చర్యల కోసం కియా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ 5 కోట్ల విరాళం ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్‌ విపత్తు నిర్వహణ సంస్థకు విరాళం ఇచ్చింది. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, మేకపాటి గౌతమ్‌రెడ్డి, కియా ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ ఉన్నతాధికారులు ముఖ్యమంత్రిని కలిశారు. విరాళానికి సంబంధించిన పత్రాలను సీఎం జగన్​కు కియా ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ ఎండీ, సీఈవో కుక్​హ్యున్‌ షిమ్‌ అందించారు. విరాళానికి సంబంధించిన నిధులను వైద్య పరికరాల కొనుగోలు వినియోగించాలని కోరారు. ఆక్సిజన్‌ కాన్సంట్రేటర్స్, వెంటిలేటర్స్, క్రయోజనిక్‌ ట్యాంకర్ల అవసరాలు వినియోగించాలని విన్నవించారు.

ABOUT THE AUTHOR

...view details