ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jun 29, 2020, 9:47 AM IST

ETV Bharat / state

కర్ణాటక మద్యం స్వాధీనం.. ఇద్దరి అరెస్టు

అనంతపురం జిల్లాలో కర్ణాటక మద్యం అక్రమ అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. పోలీసులు ఎక్కడికక్కడ సోదాలు చేస్తూ పట్టుకుంటున్నప్పటికీ విక్రయాలు ఆగడం లేదు. తాజాగా కదిరిలోని గాంధీనగర్​లో నిల్వ ఉంచిన 1,120 ప్యాకెట్ల మద్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకుని.. ఇద్దరిని అరెస్ట్ చేశారు.

karnataka liquor illegal sales in kadiri gandhi nagar ananthapuram district
అక్రమంగా కర్ణాటక మద్యం అమ్మకాలు

అనంతపురం జిల్లా కదిరి పట్టణం గాంధీనగర్​లో అక్రమంగా నిల్వ ఉంచి, విక్రయిస్తోన్న కర్ణాటక మద్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మద్యం విక్రయిస్తున్నట్లు సమాచారం తెలుసుకున్న పోలీసులు సోదాలు నిర్వహించారు. ఓ ఇంట్లో భారీగా నిల్వ ఉంచిన కర్ణాటక మద్యాన్ని గుర్తించి ఇద్దరిని అరెస్టు చేశారు.

1,120 టెట్రా ప్యాకెట్ల మద్యం, 30 లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకున్నట్లు కదిరి డీఎస్పీ షేక్ లాల్ అహ్మద్ తెలిపారు. ఈ కేసులో మరో నిందితురాలు పరారీలో ఉన్నట్లు చెప్పారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details