ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కర్ణాటక మద్యం స్వాధీనం.. ముగ్గురు అరెస్టు

అనంతపురం జిల్లా రాయదుర్గం, కర్ణాటక సరిహద్దులో అక్రమార్కులు మద్యాన్ని సరిహద్దులు దాటిస్తున్నారు. వీరిపై నిఘాపెట్టిన పోలీసులు తొమ్మిదిమందిపై కేసులు పెట్టారు. ముగ్గురిని అరెస్టు చేశారు. ఆరుగురు పరారీలో ఉన్నారని తెలిపారు.

By

Published : Jul 23, 2020, 11:01 PM IST

ananthapuram district
కర్ణాటక మద్యం స్వాధీనం.. ముగ్గురు అరెస్టు

అనంతపురం జిల్లా రాయదుర్గం ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో ఎస్ఈబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడులలో 909 కర్ణాటక మద్యం టెట్రా ప్యాకెట్లు, 5 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితులు మొత్తం తొమ్మిదిమంది కాగా ఏడుగురు రాయదుర్గం పట్టణం, ఒకరు గుమ్మగట్ట మండలం భూప సముద్రం , మరొకరు కలుగోడు గ్రామానికి చెందిన వారుగా పోలీసులు గుర్తించారు. నిందితులపై కేసులు నమోదు చేశారు. వీరిలో ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేశారు. మరో ఆరుగురు పరారైయ్యారని సీఐ తెలిపారు. గ్రామాల్లో కర్ణాటక మద్యం, నాటుసారా విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ హెచ్చరించారు.

ABOUT THE AUTHOR

...view details