కర్ణాటక రాష్ట్రం నుంచి కడప జిల్లాకు బొలెరో వాహనంలో తరలిస్తున్న 960 మద్యం ప్యాకెట్లను అనంతపురం జిల్లా ముదిగుబ్బ పోలీసులు పట్టుకున్నారు. కడప జిల్లా లింగాల గ్రామానికి చెందిన నాదెండ్ల రజాక్, నాదెండ్ల రమేష్ బాబు బొలెరో వాహనంలో కర్ణాటక మద్యం తరలిస్తూ పోలీసులకు చిక్కారు . ఇద్దరు నిందితులను అరెస్టు చేసి బొలెరో వాహనాన్ని సీజ్ చేశామని కదిరి డీఎస్పీ లాల్అహ్మద్ తెలిపారు.
కర్ణాటక మద్యం పట్టివేత.. ఇద్దరి అరెస్ట్ - liquor seized news in anantapur dst
కర్ణాటక రాష్ట్రం నుంచి అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని అనంతపురం జిల్లా ముదిగుబ్బ పోలీసులు పట్టుకున్నారు. 960 మద్యం ప్యాకెట్లు సీజ్ చేసి నిందితులను అరెస్ట్ చేశారు.
kanataka liquor seized in anantapur dst two arrested