ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jun 6, 2020, 11:39 PM IST

ETV Bharat / state

రైతు భరోసా కేంద్రాల్లో ఆకస్మిక తనిఖీలు

అనంతపురం జిల్లా జాయింట్ కలెక్టర్ నిశాంత్ కుమార్ రైతు భరోసా కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేశారు. రైతుల ఇళ్ల వద్దకు వెళ్లి విత్తన వేరుశెనగ నాణ్యత, విత్తనాలు విత్తే తేదీలు గురించి అడిగి తెలుసుకున్నారు.

Rbc
Rbc

అనంతపురం జిల్లా మడకశిర మండలం ఆమిదాలగొంది గ్రామంలో జాయింట్ కలెక్టర్ నిశాంత్ కుమార్ రైతు భరోసా కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేశారు. రైతు భరోసా కేంద్రంలో అధికారులు పంపిణీ చేసిన వేరుశెనగ వివరాలను పరిశీలించారు. అనంతరం గ్రామంలోని కొంతమంది రైతుల ఇళ్ల వద్దకు వెళ్లి విత్తన వేరుశెనగ నాణ్యత, విత్తనాలు విత్తే తేదీలు గురించి రైతులను అడిగి తెలుసుకున్నారు. మండల కేంద్రంలో కాక పంచాయతీ కేంద్రంలో రైతు భరోసా కేంద్రాల ద్వారా నాణ్యమైన వేరుశనగను ఇవ్వడం సంతోషంగా ఉందని రైతులు వారి అభిప్రాయాన్ని జేసీ మందు వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి : మొన్న ఏనుగు.. నిన్న ఆవు…అసలు ఏమైంది.?

ABOUT THE AUTHOR

...view details