ఇళ్లకే పరిమితమైన శింగనమల ప్రజలు
ఇళ్లకే పరిమితమైన శింగనమల ప్రజలు - Janatha Curfew News in Anantapuram District
కోవిడ్-19 (కరోనా వైరస్) వ్యాప్తిని అరికట్టేందుకు ప్రధాని మోదీ ఇచ్చిన పిలుపునకు ప్రజలు సంఘీభావం తెలిపారు. అన్ని షాపులు స్వచ్ఛందంగా మూసివేసి ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు.

స్వచ్ఛందంగా షాపులు మూసి జనతా కర్ఫ్యూకి సంఘీభావం
కరోనా నివారణకు ప్రధాని మోదీ పిలుపు మేరకు ప్రజలు సంఘీభావం తెలిపారు. అనంతపురం జిల్లా శింగనమల నియోజకవర్గ వ్యాప్తంగా ప్రజలు ఇళ్లకు పరిమితమయ్యారు. దుకాణాలు స్వచ్ఛందంగా మూసివేశారు. నార్పల ఎస్ఐ ఫణీంద్రనాథ్ రెడ్డి జనతా కర్ఫ్యూని పరిశీలించారు.