ఆంధ్రప్రదేశ్

andhra pradesh

రక్తనిధి కోసం రెండోరోజు కొనసాగుతోన్న ఆమరణ నిరాహార దీక్ష

By

Published : Oct 3, 2020, 11:33 AM IST

అనంతపురం జిల్లా గుంతకల్లులో రక్తనిధిని ఏర్పాటు చేయాలని అక్కడి స్వచ్ఛంద సంస్థలు, జేఏసీ రెండోరోజు ఆమరణ నిరాహార దీక్ష కొనసాగిస్తున్నాయి. ప్రభుత్వం స్పందించాలని జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు.

jac hunger strike for blood bank at guntakallu
రక్తనిధి కోసం రెండోరోజు కొనసాగుతోన్న ఆమరణ నిరాహార దీక్ష

అనంతపురం జిల్లా గుంతకల్లు ప్రభుత్వ ఆసుపత్రిలో వెంటనే రక్త నిధి ఏర్పాటు చేయాలన్న ఉద్దేశ్యంతో స్వచ్ఛంద సంస్థలు జేఏసీ తలపెట్టిన అమరణ నిరాహార దీక్ష రెండో రోజు కొనసాగుతోంది. ప్రస్తుత ప్రభుత్వం ఎన్నికల్లో బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేస్తామని హామీలు ఇచ్చారని ఇంతవరకు ఎటువంటి పనులు చేయలేదని జేఏసీ నేతలు వాపోయారు. గత నెల రోజులనుంచి బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేయాలని వివిధ రూపాల్లో నిరసనలు తెలియజేశామని...ఇప్పటికీ ప్రభుత్వం పట్టించుకోవట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రక్తం లేక ప్రజల ప్రాణాలు పోతున్నాయని...సీఎం స్పందించాలని నాయకులు కోరారు. ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ వచ్చే వరకు ఈ దీక్ష అపబోమని జేఏసీ ఉద్యమ నాయకుడు మంజుల వెంకటేష్ హెచ్చరించారు.

ABOUT THE AUTHOR

...view details