ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

జీతాలు చెల్లించాలని.. ఐపీఓపీ సిబ్బంది ధర్నా - అనంతపురం ప్రభుత్వాసుపత్రి ఐపీఐపీ సిబ్బంది ధర్నా

జీతాలు చెల్లించకుండా... పనులు ఎలా చేయాలని అనంతపురం ప్రభుత్వాసుపత్రి ఐపీఐపీ సిబ్బంది ప్రశ్నించారు. తమ బకాయిలు వెంటనే చెల్లించాలని వారు ధర్నా చేపట్టారు.

ipop staff dharna
ipop staff dharna

By

Published : May 3, 2021, 2:55 PM IST

బకాయిలో ఉన్న 11 నెలల వేతనాలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ.. అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రిలో ఐపీఓపీ సిబ్బంది ధర్నా చేపట్టారు. కొవిడ్ సమయంలో ప్రాణాలకు తెగించి పనులు చేస్తున్నా అధికారులు మాత్రం జీతాలు చెల్లించడంలో తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.

రోజుకు 300 వేతనం ఇవ్వాల్సి ఉండగా... 11 నెలలుగా ఒక్క రూపాయి అయినా ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. జీతాలు ఇవ్వకుండా ఎలా పని చేయాలని ప్రశ్నించారు. వెంటనే బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఇదే సమయంలో.. అడ్మిషన్ కోసం లైన్లో నిలబడిన కొవిడ్ రోగులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

ABOUT THE AUTHOR

...view details