ఆంధ్రప్రదేశ్

andhra pradesh

కర్నూలు, అనంతపురం జిల్లాల్లో మద్యం, నాటుసారా పట్టివేత

By

Published : Jun 10, 2021, 9:47 PM IST

కర్నూలు, అనంతపురం జిల్లాలో పోలీసుల తనిఖీలు నిర్వహించారు. అక్రమంగా తరలిస్తున్న మద్యం, సారా పట్టుకున్నారు. నిందితులను అరెస్టు చేసి.. వాహనాలను సీజ్ చేశారు.

liquor seized
మద్యం పట్టివేత

కర్నూలు, అనంతపురం జిల్లాల్లో పోలీసుల తనిఖీల్లో అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని పట్టుకున్నారు. నిందితులను అరెస్టు చేసి.. మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు.

కర్నూలు జిల్లా

కర్నూలు జిల్లా పంచలింగాల చెక్​పోస్టు వద్ద పోలీసులు చేపట్టిన తనిఖీల్లో అక్రమంగా తరలిస్తున్న 296 మద్యం సీసాలను పట్టుకున్నారు. ఈ ఘటనలో ఓ ఆటో, రెండు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. నలుగురిని అరెస్టు చేశారు. బనగానపల్లి సమీపంలోని గుత్తి రోడ్డులో అక్రమంగా తరలిస్తున్న నాలుగువందల లీటర్ల నాటుసారాను, కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సీతమ్మ తండా నుంచి నంద్యాలకు తరలిస్తుండగా పట్టుకున్నారు.

అనంతపురం జిల్లా

అనంతపురం జిల్లాలో ఎస్ఈబీ అధికారులు దాడులు నిర్వహించారు. గుంతకల్ పట్టణ శివారులోని జి.కొట్టాల సమీపంలో రైల్వే ట్రాక్ సమీపంలో రూ.ఐదు లక్షలు విలువైన 141 బాక్స్​ల కర్ణాటక మద్యంను స్వాధీనం చేసుకున్నారు.

ఇదీ చదవండి:కరోనాతో ప్రశ్నార్థకంగా ప్రైవేట్ ఉపాధ్యాయుల భవిష్యత్తు

ABOUT THE AUTHOR

...view details