దీపం పథకం ఉన్న ప్రతి ఒక్కరికీ మూడు నెలల పాటు వంటగ్యాస్ ఉచితంగా ఇవ్వాలని అనంతపురం జిల్లాలో ఐద్వా మహిళా సంఘాల సభ్యులు నిరసన తెలిపారు. కరోనా కారణంగా లాక్డౌన్ విధించిన నేపథ్యంలో పేదలు పూట గడవని పరిస్థితుల్లో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పేదల ఇబ్బందులు దృష్టిలో పెట్టుకుని గ్యాస్ ఇవ్వాలని డిమాండ్ చేశారు.
దీపం పథకం వారికి ఉచితంగా గ్యాస్ ఇవ్వాలని ఐద్వా మహిళల నిరసన - idwa womens protest for gas news
లాక్డౌన్ నేపథ్యంలో ఇబ్బందులు పడుతున్న పేదలకు మూడు నెలల పాటు వంట గ్యాస్ ఉచితంగా ఇవ్వాలని అనంతపురం జిల్లాలో ఐద్వా మహళా సంఘాల సభ్యులు నిరసన తెలిపారు. దీపం పథకం ఉన్న ప్రతి ఒక్కరికీ గ్యాస్ అందించాలని కోరారు. తలపై గ్యాస్బండ పెట్టుకుని వినూత్నంగా ఆందోళన చేశారు.

దీపం పథకం వారికి ఉచితంగా గ్యాస్ ఇవ్వాలని ఐద్వా మహిళల నిరసన