ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

స్లాబ్ కూలి.. ముగ్గురు కూలీలకు తీవ్రగాయాలు

ధర్మవరంలోని శివరాం నగర్​లో ఇంటి నిర్మాణం చేస్తున్న కూలీలపై స్లాబ్ కూలి ముగ్గురు కూలీలకు తీవ్రగాయాలయ్యాయి.

By

Published : Sep 15, 2019, 12:59 PM IST

ప్రమాదం

స్లాబ్ కూలి.. ముగ్గురు కూలీలకు తీవ్రగాయాలు

అనంతపురం జిల్లా ధర్మవరం పట్టణంలోని శివరాంనగర్​లో ఇంటి స్లాబ్​ కూలి ముగ్గురు కూలీలకు తీవ్ర గాయాలయ్యాయి. కొత్తగా నిర్మిస్తున్న ఇంటిపై నీటి ట్యాంకు నిర్మించారు. స్లాబ్ కింద ఏర్పాటు చేసిన కర్రలు తొలగించడంతో కార్మికులపై స్లాబ్ కూలింది. ముగ్గురు కూలీలు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను వెంటనే ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం అనంతపురం తీసుకెళ్లారు.

ABOUT THE AUTHOR

...view details