ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

హెచ్​ఎల్​సీ కాలువకు పెరిగిన ప్రవాహం... కాలువ, సమీప చెరువుకు బుంగ - టీబీహెచ్​ఎల్​సీ కాలువకు గండి

అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గంలోని తుంగభద్ర హెచ్​ఎల్​సీ కాలువలో నీటి ప్రవాహం పెరిగింది. అధిక ప్రవాహం వల్ల బొమ్మనహల్, కనేకల్ మండలాల్లో కాలువకు, చిక్కనేశ్వర వడియార్ చెరువుకు బుంగ పడింది. ఈ క్రమంలో లోతట్టు ప్రాంతాల ప్రజలు, రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

hole to wadiyar Pond due to heavy flow
హెచ్​ఎల్​సీ కాలువకు పెరిగిన నీటి ప్రవాహం

By

Published : Nov 29, 2020, 7:11 PM IST

రెండు రోజులుగా తుంగభద్ర జలాశయం నుంచి టీబీహెచ్​ఎల్​సీలో నీటి ప్రవాహం పెరిగింది. అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గంలో ఈ కాలువలో నీరు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. అయితే బొమ్మనహాళ్ మండలం కృష్ణాపురం వద్ద శనివారం హెచ్ఎల్​సీ కాలువకు బుంగ పడింది. స్థానిక రైతులు, హెచ్ఎండీఏ అధికారులు యుద్ధప్రాతిపదికన మరమ్మతులు చేశారు. టీజీహెచ్ఎల్​సీ కాలువ గట్లు బలహీనంగా ఉన్నందున లోతట్టు ప్రాంతాల ప్రజలు, రైతులు భయాందోళనలకు గురవుతున్నారు. కనేకల్ సమీపంలోని చిక్కనేశ్వర వడియార్ చెరువుకు బుంగ పడింది. ఫలితంగా చెరువు ఆయకట్టు కింద భూములున్న రైతులు ఆందోళనకు గురవుతున్నారు.

మరో రెండు రోజులు నీటి ప్రవాహం..

మరో రెండు రోజులపాటు తుంగభద్ర జలాశయం నుంచి ఎస్​ఎల్​సీకి నీటి విడుదల కొనసాగుతుంది. టీబీహెచ్ఎల్​సీ కాలువ గట్లు బలహీనంగా ఉన్నందున అధికారులను అప్రమత్తం చేశాం. రంద్రం పడిన చిక్కనేశ్వర వడియార్ చెరువుకు వెంటనే మరమ్మతులు చేపడతాం. -గాధర్ రెడ్డి, హెచ్​ఎల్​సీ డీఈ

ABOUT THE AUTHOR

...view details