ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Dec 4, 2020, 1:09 PM IST

ETV Bharat / state

ప్రమాదంలో హిందూపురం పట్టు రీలర్ల సంఘం అధ్యక్షుడు మృతి

గుంటూరులోని చౌడవరం వద్ద జాతీయరహదారిపై ప్రమాదం జరిగింది. నిలిపి ఉన్న హైవే వాహనాన్ని కారు ఢీ కొట్టిన ఘటనలో.. అనంతపురం జిల్లా హిందూపురం పట్టు రీలర్ల సంఘం అధ్యక్షుడు రియాజ్ అహ్మద్ చనిపోయారు.

hindupuram-silk
hindupuram-silk

హిందూపురం పట్టు రీలర్ల సంఘం అధ్యక్షుడు రియాద్ అహ్మద్ రోడ్డు ప్రమాదంలో మరణించారు. మరో 8 మంది గాయపడ్డారు. గుంటూరులోని చౌడవరం వద్ద జాతీయ రహదారిపై నిలిపి ఉన్న హైవే భద్రతా వాహనాన్ని కారు ఢీకొట్టిన ఘటనలో రియాజ్.. అక్కడికక్కడే ప్రాణం విడిచారు. అనంతపురం జిల్లాకు చెందిన పట్టు రీలర్లు తమ సమస్యలపై సీఎంను కలిసేందుకు వెళ్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది.

డ్రైవర్ నిద్రమత్తుతో పాటు పెట్రోలింగ్ వాహనం రోడ్డుపైన ఆపి ఉంచటం ప్రమాదానికి కారణమని పోలీసులు గుర్తించారు. హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ జీజీహెచ్ కు చేరుకుని క్షతగాత్రులను పరామర్శించారు. మంచి వైద్యం అందించాలని వైద్యులను కోరారు. మరణించిన వ్యక్తితో పాటు గాయపడిన వారి కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.

ABOUT THE AUTHOR

...view details