ఆంధ్రప్రదేశ్

andhra pradesh

కుటుంబం పరువు తీస్తున్నాడని.. భర్తను హత్యచేసిన భార్య!

By

Published : Jul 11, 2021, 6:11 PM IST

అనంతపురం జిల్లా హిందూపురం రూరల్​ పోలీస్ స్టేషన్​ పరిధిలో గత సంవత్సరం జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. మృతుడి భార్యే హత్య చేసినట్లు పోలీసులు వెల్లడించారు. కేసులో నిందితులను అరెస్టు చేసి కోర్టులో హాజరు పరుస్తామని సీఐ హమీద్ ఖాన్​ తెలిపారు.

hindupur police crack a wife killed her husband case
భర్తను హత్యచేసిన భార్య

ఓ హత్య కేసులో ఏడాది తర్వాత నిందితులు పట్టుబడిన ఘటన అనంతపురం జిల్లాలో చోటుచేసుకుంది. పరిగి మండల కేంద్రంలో 2020 జూన్ 10న.. కిష్టప్ప (60) అనే వ్యక్తి హత్యకు గురయ్యాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతుడి భార్యే హత్య చేసినట్లు దర్యాప్తులో గుర్తించామని హిందూపురం రూరల్ సీఐ వెల్లడించారు. నేరం చేసిన తర్వాత నిందితులు ఎప్పటికైనా పట్టుబడతారని స్పష్టం చేశారు.

కిష్టప్ప మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. నలుగురిలో కుటుంబం పరువు తీస్తున్నాడని అతని భార్య ఆగ్రహించింది. భర్తను హతమార్చాలని నిర్ణయించింది. ఇంటి పక్కన ఉన్న మరో వ్యక్తి సాయంతో కిష్టప్పను హతమార్చింది. నిందితులను అరెస్టు చేసి కోర్టులో హాజరు పరుస్తాం.- హమీద్ ఖాన్, సిఐ

ABOUT THE AUTHOR

...view details