మడకశిర నగర పంచాయతీ పరిధిలోని 20 వార్డులకు గాను 15 వార్డుల్లో వైకాపా, ఐదు వార్డుల్లో తెదేపా అభ్యర్థులు విజయం సాధించారు. ఛైర్మన్ పదవి ఎస్సీకి కేటాయించారు. ఈ క్రమంలో వైకాపా నుంచి ఏడో వార్డులో గెలుపొందిన లక్ష్మీనరసమ్మ, ఆరో వార్డులో గెలిచిన ప్రియాంక, 17వ వార్డు విజయం సాధించిన సుభద్ర పోటీ పడుతున్నారు.
మడకశిర ఛైర్మన్ పదవికి గట్టిపోటి.. దక్కించుకోవాలని విశ్వప్రయత్నాలు
అనంతపురం జిల్లా మడకశిర నగర పంచాయతీ పరిధిలో ఛైర్మన్ పదవికి గట్టి పోటీ నెలకొంది. ముగ్గురు వ్యక్తులు ఈ పదవిని దక్కించుకోవాలని విశ్వప్రయత్నాలు చేస్తున్నారు.
మడకశిరలో ఛైర్మన్ పదవి పోటీ పడుతున్న అభ్యర్థులు