ఆంధ్రప్రదేశ్

andhra pradesh

మడకశిర ఛైర్మన్​ పదవికి గట్టిపోటి.. దక్కించుకోవాలని విశ్వప్రయత్నాలు

By

Published : Mar 16, 2021, 3:39 PM IST

అనంతపురం జిల్లా మడకశిర నగర పంచాయతీ పరిధిలో ఛైర్మన్​ పదవికి గట్టి పోటీ నెలకొంది. ముగ్గురు వ్యక్తులు ఈ పదవిని దక్కించుకోవాలని విశ్వప్రయత్నాలు చేస్తున్నారు.

Madakashira panchayath
మడకశిరలో ఛైర్మన్​ పదవి పోటీ పడుతున్న అభ్యర్థులు

మడకశిర నగర పంచాయతీ పరిధిలోని 20 వార్డులకు గాను 15 వార్డుల్లో వైకాపా, ఐదు వార్డుల్లో తెదేపా అభ్యర్థులు విజయం సాధించారు. ఛైర్మన్​ పదవి ఎస్సీకి కేటాయించారు. ఈ క్రమంలో వైకాపా నుంచి ఏడో వార్డులో గెలుపొందిన లక్ష్మీనరసమ్మ, ఆరో వార్డులో గెలిచిన ప్రియాంక, 17వ వార్డు విజయం సాధించిన సుభద్ర పోటీ పడుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details