ఆంధ్రప్రదేశ్

andhra pradesh

భారీ వర్షానికి పొంగి పొర్లుతున్న వాగులు

By

Published : Sep 1, 2020, 4:11 PM IST

అనంతపురం జిల్లా సోమందేపల్లి, పెనుకొండ మండలాల్లో సోమవారం భారీ వర్షం కురిసింది. చాలా రోజుల విరామం అనంతరం వర్షం కురవటంతో రైతులు ఆనందం వ్యక్తం చేశారు.

Heavy rain in somandepalli, penukonda in ananthapuram district
భారీ వర్షానికి పొంగి పొర్లుతున్న వాగులు

అనంతపురం జిల్లాలోని సోమందేపల్లి, పెనుకొండ మండలాల్లో సోమవారం రాత్రి భారీ వర్షం కురిసింది. సోమందేపల్లి మండలంలో 80.6 మిల్లీ మీటర్లు, పెనుకొండ మండలంలో 48.7 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయినట్లు అధికారులు తెలిపారు. ఈ వానతో పలు గ్రామాల్లో వాగులు, వంకలు వరద నీటితో పొంగి పొర్లుతున్నాయి. రంగేపల్లి-చెన్నాపురం గ్రామాల మధ్య ఉన్న రైల్వే భూగర్భ వంతెన మునిగిపోయింది. సుమారు రెండు వారాల తర్వాత.. భారీ వర్షం కురవడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details