అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం మండలంలోని నార్పల-అనంతపురం రహదారిపై ఉన్న మద్యం దుకాణం వద్ద భారీ సంఖ్యలో మందుబాబులు బారులు తీరారు. భౌతికదూరం పాటించకుండా, మాస్కులు సైతం ధరించకుండా గుంపులుగా ఎగబడ్డారు. మద్యం దుకాణాదారులు కానీ, అధికారులు గానీ కనీస జాగ్రత్తలు తీసుకునేలా వారిని హెచ్చరించకపోవడం గమనార్హం.
మద్యం దుకాణం ముందు బారులు తీరిన మందుబాబులు - corona virus in ananthapuram district
మద్యం దుకాణాల వద్ద భౌతికదూరం పాటించాలన్న నిబంధనను మద్యంప్రియులు విస్మరిస్తున్నారు. మద్యం మీద ఉండే ఆశ.. కరోనాతో వచ్చే ముప్పుపై ధ్యాస లేకుండా చేస్తోంది. అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం మండలం గాంధీనగర్లోని మద్యం దుకాణం ముందు మందుబాబులు పెద్ద సంఖ్యలో బారులు తీరారు.

మద్యం దుకాణం ముందు బారులు తీరిన మందుబాబులు