ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Aug 4, 2021, 4:40 PM IST

ETV Bharat / state

పింఛన్ కోసం పోరాటం.. ఎంపీడీవో ఆఫీస్​ ఎదుట ధర్నా

పింఛన్ తొలగించారంటూ.. దివ్యాంగులు రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. వీరికి తెదేపా హిందూపురం పార్లమెంటరీ నియోజకవర్గ అధ్యక్షుడు బీకే పార్థసారథి మద్దతు తెలిపారు.

protest at MPDVO office
ఎంపీడీవో ఆఫీస్​ ఎదుట ధర్నా

అనంతపురం జిల్లా రొద్దం మండలంలో దివ్యాంగులకు ప్రభుత్వం అందజేస్తున్న రూ.5000 పెన్షన్... 35 మందికి నిలిచిపోయింది. ఈ విషయంపై బాధితులతో కలిసి.. పెనుకొండ - పావగడ ప్రధాన రహదారిపై ఉన్న ఎంపీడీవో కార్యాలయం ఎదుట తెదేపా నాయకులు ధర్నా చేపట్టారు.

వీరికి ఆ పార్టీ హిందూపురం పార్లమెంటరీ నియోజకవర్గ అధ్యక్షుడు బీకే పార్థసారథి మద్దతు తెలిపారు. ఇంత జరుగుతున్నా... అధికారులు ఎవరూ వీరిని పట్టించుకోకపోవడం శోచనీయమని నాయకులు అన్నారు. దివ్యాంగులకు న్యాయం జరిగే వరకు పోరాడతామని వారంతా స్పష్టం చేశారు.

ABOUT THE AUTHOR

...view details