ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

బాచుపల్లి హత్య కేసును ఛేదించిన గుత్తి పోలీసులు - బాచుపల్లి హత్య కేసులో నిందితుల అరెస్ట్

అదనపు కట్నం కోసం కట్టుకున్న భర్తే భార్యను కడతేర్చిన ఘటనను గుత్తి పోలీసులు ఛేదించారు. భర్తతో పాటు 9 మంది నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.

anantapuram district gutthi police solved bachupalli murder case

By

Published : Oct 18, 2019, 9:39 AM IST

బాచుపల్లి హత్య కేసును ఛేదించిన గుత్తి పోలీసులు..

అదనపు కట్నం కోసం భర్తే భార్యను కడతేర్చిన ఘటనను గుత్తి పోలీసులు ఛేదించారు. గత వారం అనంతపురం జిల్లా గుత్తి మండలం బాచుపల్లిలో ఈ నెల 11 వ తేదీన చెంచులక్ష్మి అనే మహిళ హత్యకు గురైంది. అదనపు కట్నం కోసం వేధించి భర్తే గొంతు నులిమి చంపినట్లు మృతురాలి బంధువులు ఆరోపించారు. కేసును సీరియస్​గా తీసుకున్న పోలీసులు వారంలోపే నిందితులను పట్టుకున్నారు. భర్తతో పాటు 9 మంది నిందితులను గుత్తి పోలీసులు రిమాండ్​కు తరలించారు. కట్నంగా తీసుకున్న ద్విచక్ర వాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తాడిపత్రి డీఎస్పీ మాట్లాడుతూ.. గొంతు నులిమి చంపి.. ఏమీ తెలియనట్లుగా విషపు గుళికలు మింగిందని ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారనన్నారు. నిందితుల్లో ఒక మైనర్​ కూడా ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details