ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నాసిరకం విత్తనాలు ఇస్తున్నారని రైతుల ఆందోళన - groundnut farmers news in anantapur dst

నాసిరకం వేరుశనగ విత్తనాలు పంపిణీ చేస్తున్నారని అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో శనగ రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సచివాలయ సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. మంచి విత్తనాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

groundnut farmers protest in anantapur dst kalayandurgam about providing cheep quality seeds
groundnut farmers protest in anantapur dst kalayandurgam about providing cheep quality seeds

By

Published : May 27, 2020, 7:50 AM IST

అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం వ్యవసాయ సబ్ డివిజన్ లో నాసిరకం విత్తనాలను పంపిణీ చేస్తున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. శెట్టూరు మండలం ఖైరేవు గ్రామంలో పంపిణీ చేసిన వేరుశనగ కాయలు నాసిరకంగా ఉన్నాయన్నారు. విత్తనాల రంగులు వేరువేరుగా ఉన్నాయని గమనించిన రైతులు.. సంబంధిత అధికారులను ప్రశ్నించేందుకు గ్రామ సచివాలయానికి వెళ్లారు.

కాసేపు ఉద్రిక్తత వాతావారణం నెలకొన్న కారణంగా.. సమాచారం అందుకున్న పోలీసులు జోక్యం చేసుకున్నారు. ఆందోళనకు వచ్చిన వారితో మాట్లాడి పరిస్థితి చక్కదిద్దారు. పూర్తి నాసిరకంగా ఉన్న వేరుశెనగ కాయలను మార్చి మంచివి ఇస్తామని కళ్యాణదుర్గం వ్యవసాయ సబ్ డివిజన్ సహాయ సంచాలకులు మల్లికార్జున.. రైతులకు హామీ ఇచ్చారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details