అనంతపురం జిల్లా కల్యాణదుర్గం పట్టణంలో రెండు కోతులు పోట్లాడుకున్నాయి. ఈ ఘటనలో ఒక మర్కటం మృతి చెందింది. మున్సిపాలిటీ, ఆటో కార్మికులు ఆ మర్కటానికి పూజలు చేసి అంత్యక్రియలు జరిపారు. పట్టణ ప్రజలు మాత్రం రోడ్లపై పలు కాలనీల్లో కోతుల గుంపుగా వచ్చి...ఇళ్లల్లో చొరబడి విధ్వంసాలు సృష్టిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మర్కటాల బెడద తగ్గించాలని అధికారులను కోరుతున్నారు. ఏదీ ఏమైనా... ఆ కోతికి ఘనంగా వీడ్కోలు పలికిన కార్మికులను పలువురు అభినందించారు.
కోతికి శాస్త్రోక్తంగా అంత్యక్రియలు...! - కోతికి శాస్త్రోక్తంగా అంత్యక్రియలు...
రెండు కోతులు పోట్లాడుకున్న ఘటనలో ఒక కోతి చనిపోయింది. కల్యాణదుర్గం మున్సిపాలిటీ, ఆటో కార్మికులు ఆ కోతికి సంప్రదాయబద్ధంగా అంత్యక్రియలు జరిపారు.
![కోతికి శాస్త్రోక్తంగా అంత్యక్రియలు...!](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4280740-436-4280740-1567085837970.jpg)
కోతికి శాస్త్రోక్తంగా అంత్యక్రియలు...
TAGGED:
అనంతపురం జిల్లా కల్యాణదుర్గం