అనంతపురం జిల్లా తాడిమర్రి మండలం భీమరాయపేట గ్రామంలో గ్రామ వాలంటీర్ రాజశేఖర్... మద్యం సేవించి హల్చల్ చేశాడు. గ్రామంలో ఉన్న వీరతిమ్మమ్మ అమ్మవారి ఆలయంలో ప్రవేశించి విగ్రహాన్ని ధ్వంసం చేశాడు. అడ్డుకోబోయిన గ్రామస్థులపైనా దాడికి దిగాడు. దీనిపై గ్రామస్థులు పోలీసులకు ఫిర్యాదు చేయటంతో వారు వాలంటీర్ను అదుపులోకి తీసుకున్నారు. వాలంటీర్పై చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు.
గ్రామ వాలంటీర్ నిర్వాకం.. మద్యం మత్తులో అమ్మవారి విగ్రహం ధ్వంసం - మద్యం మత్తులో అమ్మవారి విగ్రహం ధ్వంసం చేసిన వార్తలు
అతనో గ్రామ వాలంటీర్. బాధ్యతతో మెలగాల్సిన అతనే దారి తప్పాడు. మద్యం సేవించి గ్రామంలో ఉన్నవారి అమ్మవారి విగ్రహాన్ని పగలగొట్టాడు. అడ్డుకోబోయిన గ్రామస్థులపైనా దాడి చేశాడు. అనంతపురం జిల్లా భీమరాయపేటలో జరిగిన ఘటన వివరాలివి..!
![గ్రామ వాలంటీర్ నిర్వాకం.. మద్యం మత్తులో అమ్మవారి విగ్రహం ధ్వంసం గ్రామ వాలంటీర్ నిర్వాకం.. మద్యంమత్తులో అమ్మవారి విగ్రహం ధ్వంసం](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7106227-292-7106227-1588874591647.jpg)
గ్రామ వాలంటీర్ నిర్వాకం.. మద్యంమత్తులో అమ్మవారి విగ్రహం ధ్వంసం