ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'జగన్​ పాలనలో ప్రజలు సంతోషంగా ఉన్నారు'

ప్రజాభిప్రాయాన్ని గౌరవించి తెదేపా నేతలు బుద్ధి మార్చుకోవాలన్నారు ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి. జగన్​ వందరోజుల పాలనలో ప్రజలు సంతోషంగా ఉన్నారని తెలిపారు.

By

Published : Sep 13, 2019, 12:32 PM IST

కాపు రామచంద్రారెడ్డి

జగన్​ పాలనలో ప్రజలు సంతోషంగా ఉన్నారు

అనంతపురం జిల్లా కదిరిలో ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి పర్యటించారు. ప్రజాభిప్రాయాన్ని గౌరవించి తెదేపా నేతలు బుద్ధి మార్చుకోవాలని హితవు పలికారు. జగన్​ వందరోజుల పాలనలో ప్రజలు సంతోషంగా ఉన్నారని తెలిపారు. అది చూసి ఓర్వలేకే విపక్షనేతలు కుట్రలు పన్నుతున్నారని మండిపడ్డారు. చౌకబారు రాజకీయాలను ప్రభుత్వం కఠినంగా అణిచివేస్తుందన్నారు. వచ్చే ఎన్నికల నాటికి తెదేపా మరో పార్టీలో విలీనం కావటం ఖాయమన్నారు.

ABOUT THE AUTHOR

...view details