అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం తూర్పుకోడిపల్లికి చెందిన ఇంజనీరింగ్ విద్యార్థిని మల్లిపల్లి గీతాంజలి (21) సర్పంచి పదవికి బుధవారం నామినేషన్ దాఖలు చేశారు. కృష్ణా జిల్లాలోని ఓ కళాశాలలో ఇంజినీరింగ్ ఫైనలియర్ చదువుతున్న గీతాంజలి.. గ్రామంలో సమస్యల పరిష్కారంపై ఆసక్తి, ప్రజాసేవపై మక్కువతో పోటీకి సిద్ధపడినట్లు చెప్పారు. ఆమె తండ్రి నారాయణ తెదేపా ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శి.
సర్పంచి పదవికి నామినేషన్ దాఖలు చేసిన ఇంజనీరింగ్ విద్యార్థిని - అనంతపురం జిల్లా తాజా వార్తలు
ఇంజనీరింగ్ ఫైనలియర్ చదువుతున్న గీతాంజలి.. సర్పంచి పదవికి నామినేషన్ దాఖలు చేశారు. ఇంజనీరింగ్ ఫైనలియర్ చదువుతున్న ఆమె గ్రామంలోని సమస్యల పరిష్కారంపై ఆసక్తి చూపి ఈ పోటీకి సిద్ధపడినట్లు తెలిపారు.
![సర్పంచి పదవికి నామినేషన్ దాఖలు చేసిన ఇంజనీరింగ్ విద్యార్థిని Gitanjali,](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10492255-1072-10492255-1612402312463.jpg)
Gitanjali,