ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఆలయంలో అనుమానాస్పదంగా నలుగురు..పోలీసులకు అప్పగింత - అనంతపురం జిల్లా నంబూలపూలకుంట మండలం సారగుండ్లపల్లి వద్ద వెంకటేశ్వరస్వామి ఆలయంలో తిరుగుతున్న నలుగురు అనుమానితులు అరెస్ట్

గుడిలో అనుమానంగా తిరుగుతున్న నలుగురు వ్యక్తులను గ్రామస్థులు నిర్బంధించి పోలీసులకు అప్పగించిన సంఘటన అనంతపురం జిల్లా నంబులపూలకుంటలో జరిగింది.

four-persons-arrested-on-suspicion
ఆలయంలో అనుమానస్పదంగా నలుగురు

By

Published : Mar 3, 2020, 2:34 PM IST

ఆలయంలో అనుమానాస్పదంగా నలుగురు..పోలీసులకు అప్పగింత

అనంతపురం జిల్లా నంబులపూలకుంట మండలం సారగుండ్లపల్లి వద్ద వెంకటేశ్వర స్వామి ఆలయంలో నలుగురు కొత్త వ్యక్తులు అనుమానాస్పదంగా తిరగడాన్ని గుర్తించిన గ్రామస్తులు వారిని నిర్బంధించారు. ఆలయంలోనికి వెళ్ళిన వ్యక్తులు పొంతన లేని సమాధానాలు చెప్పడం వల్ల అనుమానం వచ్చి వారి వద్ద ఉన్న వస్తువులను కింద పడేశారు. టేపు, స్కెచ్​లు, గ్లౌస్, ఆలయ గోపురంపైన ఉంచే కలశం లాంటి వస్తువులను గుర్తించారు. వారిని నంబులపూలకుంట పోలీసులకు అప్పగించారు. అనుమానితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు దర్యాప్తు తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామని తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details