అనంతపురం జిల్లా మడకశిర మండలంలోని గంగులవాయిపాలెంలోని చెరువు మరమ్మతులను పీసీసీ మాజీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి పరిశీలించారు. గంగులవాయిపాలెం గ్రామంలో గత సంవత్సరంలో కురిసిన వర్షాలకు అప్పట్లో చెరువుకు గండిపడటంతో నీరంతా పక్కనే ఉన్న కర్ణాటక ప్రాంత చెరువులకు పోయింది. చెరువు మరమ్మతులకు ప్రభుత్వం రూ.50 లక్షల నిధులు విడుదల చేసింది. ఆ చెరువు మరమ్మతు పనులను రఘువీరా రెడ్డి, జిల్లా నీటిపారుదల శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పరిశీలించారు.
చెరువు మరమ్మతులను పరిశీలించిన పీసీసీ మాజీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి - మాజీ పీసీసీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డి వార్తలు
అనంతపురం జిల్లా మడకశిరలోని గంగులవాయిపాలెంలో... చెరువు మరమ్మతు పనులు పీసీసీ మాజీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి పరిశీలించారు. గత సంవత్సరం కురిసిన వర్షానికి గంగువాయిపాలెంలో చెరువుకు గండి పడింది. ఆ పనులకు ప్రభుత్వం రూ.50 లక్షల నిధులను విడుదల చేసింది.
చెరువు మరమ్మతు పనులను పరిశీలించిన మాజీ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి