లాక్డౌన్లో ప్రజలు శారీరక వ్యాయామానికి పూర్తిగా దూరమవుతున్నారు. దీర్ఘకాలిక వ్యాధులైన మధుమేహం, రక్తపోటు, హృద్రోగ సమస్యలు ఉన్నవారు ఇంట్లోనే ఉంటూ పౌష్టికాహారం తీసుకోవాల్సిన అవసరం ఉంది. కరోనా సోకుతున్న వారిలో వృద్ధులే ఎక్కువగా ఉంటున్న నేపథ్యంలో వారు సీ, ఈ విటమిన్లతో కూడిన ఆహారాన్ని తప్పనిసరిగా తీసుకోవాలని నిపుణులు సూచించారు. వైరస్ రాకుండా ఉండాలంటే ప్రొటీన్లు, విటమిన్లు ఉండే ఆహారం తీసుకోవాలని, జంక్ఫుడ్లకు దూరంగా ఉండాలని చెప్పారు. ఇలాంటి విషయాలపై ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పోషకాహార విభాగం శాస్త్రవేత్త డా.సుధారాణితో మా ప్రతినిధి ముఖాముఖి.
'కరోనా కట్టడికి.. పౌష్టికాహారమే సరైన మార్గం' - కరోనా నివారణకు పౌష్టికాహారమే మేలంటున్న నిపుణుల
కరోనా కట్టడికి పౌష్టికాహారం తీసుకోవడమే మేలని నిపుణులు సూచించారు. జంక్ఫుడ్కు దూరంగా ఉండాలని.. ప్రోటీన్లు, విటమిన్లు ఉండే ఆహారాన్ని తీసుకోవాలని తెలిపారు. వృద్ధుల్లో మధుమేహం, రక్తపోటు, హృద్రోగ సమస్యలు ఉండేవారు మరింత జాగ్రత్తగా ఉండాలని.. నిత్యం యోగా, శారీరక వ్యాయామం చేయాలని చెప్పారు.
!['కరోనా కట్టడికి.. పౌష్టికాహారమే సరైన మార్గం' 'కరోనా కట్టడికి.. పౌష్టికాహారమే సరైన మార్గం'](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6891219-1085-6891219-1587537105851.jpg)
'కరోనా కట్టడికి.. పౌష్టికాహారమే సరైన మార్గం'
కరోనా నేపథ్యంలో జంక్ఫుడ్కు దూరంగా ఉండాలంటున్న నిపుణులు
ఇదీ చూడండి: