చిత్రావతి జలాశయం ముంపు గ్రామమైన అనంతపురం జిల్లా తాడిమర్రి మండలం మరిమాకుల పల్లి గ్రామస్థులు పరిహారం కోసం ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ జల దీక్ష చేపట్టారు. పునరావాస ప్యాకేజీ కింద 18 ఏళ్ళు నిండిన వారందరికీ పరిహారం వర్తింపజేయాలని అధికారులను కోరుతున్నా... పట్టించుకోవడంలేదని ఆందోళన చేపట్టారు. గ్రామ సమీపంలోని చిత్రావతి జలాశయంలో దిగి జలదీక్ష చేశారు. గ్రామంలోకి నీళ్లు వస్తున్నా.. తమకు పరిహారం ఇవ్వడం లేదని గ్రామానికి చెందిన యువకులు నిరసన తెలిపారు. తమ గ్రామానికి పునరావాస ప్యాకేజీ వర్తింపజేసి న్యాయం చేయాలని అధికారులను, ప్రభుత్వాన్ని కోరారు.
పునరావాస ప్యాకేజీ వర్తింపచేయాలని జలదీక్ష - అనంతపురం జిల్లాలో భారీ వర్షాలు
ముంపు గ్రామమైన తమకు న్యాయం చేయాలంటూ అనంతపురం జిల్లా తాడిమర్రి మండలం ప్రజలు జలదీక్ష చేపట్టారు. నీరు గ్రామాల్లోకి వస్తున్నా పరిహారం ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. 18 ఏళ్ళు నిండిన వారందరికీ పరిహారం వర్తింపజేయాలని డిమాండ్ చేశారు.

flood funds