అనంతపురం జిల్లా బొమ్మనహాళ్ మండల కేంద్రంలో.... హనుమంతప్ప, బసవరాజుకు చెందిన చేపల చెరువులో గుర్తుతెలియని వ్యక్తులు రసాయనాలు కలపటంతో 13వేల చేపలు మరణించాయి. రెండున్నర లక్షలకుపైగా నష్టం వాటిల్లిందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చేపలు పెద్దవి అయ్యాయని.. మరికొన్ని రోజుల్లో విక్రయానికి సన్నాహాలు చేస్తుండగా ఇలా జరిగిందని వాపోతున్నారు. బొమ్మనహాళ్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయనున్నట్టు తెలిపారు.
చెరువుల్లో విషప్రయోగం.. భారీగా చేపలు మృతి
అనంతపురం జిల్లా హనుమంతప్ప, బసవరాజు చెరువుల్లో విషప్రయోగం జరిగింది. గుర్తుతెలియని వ్యక్తులు రసాయనాలు కలపడంతో భారీగా చేపలు మృత్యువాత పడ్డాయని స్థానికులు చెబుతున్నారు. రూ. 2.5లక్షలకుపైగా నష్టం వాటిల్లిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
chemical action on fish