ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Oct 29, 2020, 11:50 AM IST

ETV Bharat / state

మృతి చెందిన కానిస్టేబుళ్ల కుటుంబాలకు సహోద్యోగుల ఆర్థిక సాయం

అనంతపురం జిల్లాలో ఇటీవల మరణించిన హెడ్​ కానిస్టేబుళ్ల కుటుంబాలకు సహచర బ్యాచ్​మేట్స్​ ఆర్థిక సాయం అందించారు. ఈ మొత్తాన్ని ఎస్పీ చేతుల మీదుగా మృతుల కుటుంబసభ్యులకు అందించారు.

Financial assistance
మృతి చెందిన కానిస్టేబుల్స్​​ కుటుంబాలకు ఆర్థిక సాయం అందిస్తున్న అధికారులు

అనంతపురం జిల్లా హిందూపురం వన్​టౌన్ కానిస్టేబుల్​గా పనిచేసే రంగానాయక్ ఇటీవల మరణించాడు. అతని కుటుంబానికి ఆర్థిక సాయం అందించేందుకు అతని బ్యాచ్​మేట్స్ రూ. 2,12,500 పోగు చేశారు. ఈ మొత్తాన్ని జిల్లా ఎస్పీ చేతుల మీదుగా రంగానాయక్ భార్య దేవీబాయికి అందజేశారు.

లేపాక్షి

ఇటీవల మృతి చెందిన హెడ్ కానిస్టేబుల్ ఫతే నాయక్ కుటుంబానికి అతని సహోద్యోగి రూ.55 వేలు ఆర్థిక సాయం చేశారు. ఎస్పీ సత్య ఏసుబాబు చేతుల మీదుగా ఈ మొత్తాన్ని మృతుడి భార్యకు అందించారు.

ఇదీ చదవండి:

కానిస్టేబుల్ అసభ్య ప్రవర్తన.. ఫిర్యాదు చేసిన కేసు నమోదులో జాప్యం

ABOUT THE AUTHOR

...view details