ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'అసలు, వడ్డీ కడితేనే రుణాలు రెన్యువల్ చేస్తాం' - Farmers concerned that their loans should be renewed with interest

అనంతపురం జిల్లాలో బ్యాంకు అధికారులతో రైతులు వాగ్వాదానికి దిగారు. ప్రతి ఏటా రైతులతో వడ్డీ మాత్రమే తీసుకుని పంట రుణాలను రెన్యువల్ చేసేవారు. కానీ ఇప్పుడు అసలు, వడ్డీ, మొత్తం కడితే రెన్యువల్ చేస్తామని అధికారులు చెప్పటంతో రైతులు వాగ్వాదనికి దిగారు.

ananthapuram district
వడ్డీతోనే తమ రుణాలు రెన్యువల్ చేయాలని రైతుల ఆందోళన...

By

Published : Apr 28, 2020, 6:38 PM IST

అనంతపురం జిల్లా కుందుర్పి మండల కేంద్రంలో బ్యాంకు అధికారులతో రైతులు వాగ్వాదానికి దిగారు. మండల కేంద్రంలోని సిండికేట్ బ్యాంకులో ప్రతి ఏటా రైతులతో వడ్డీ మాత్రమే తీసుకుని పంట రుణాలను రెన్యువల్ చేసేవారు. అయితే ఈసారి ఆ బ్యాంకు కెనరా బ్యాంక్ లో విలీనం అయిన కారణంగా... నిబంధనలు మారాయి.

అసలు, వడ్డీ మొత్తం కడితేనే రెన్యువల్ చేస్తామని అధికారులు రైతులకు తేల్చిచెప్పారు. రైతులు బ్యాంకు అధికారులతో వాగ్వాదానికి దిగారు. ఈ విషయంలో కొంత మంది రైతులు బ్యాంకు అధికారులతో మధ్యవర్తిత్వం కొనసాగించినా సమస్య పరిష్కారం కాలేదు. బ్యాంకు సిబ్బంది మాత్రం తమ ఉన్నతాధికారులతో చర్చిస్తామని వచ్చే సోమవారం వరకు తమకు సమయం ఇవ్వాలని కోరారు.

ABOUT THE AUTHOR

...view details