అప్పుల బాధ భరించలేక అనంతపురం జిల్లా పాల్తూరులో గోవిందప్ప అనే రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. పంటపై పెట్టిన పెట్టుబడి రాక.... అప్పులు పెరిగి మనస్థాపం చెందిన రైతు ఈ ఘాతుకానికి పాల్పడినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. పంచనామా నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.
అప్పుల బాధతో రైతు బలవన్మరణం - అనంతపురం జిల్లా తాజా వార్తలు
పంటకు చేసిన అప్పులు తీర్చలేక.... అప్పుల్లో కూరుకుపోయిన పాల్తూరుకు చెందిన రైతు ఆదివారం ఆత్మహత్య చేసుకున్నాడు. మరణించిన వ్యక్తి గోవిందప్పగా పోలీసులు గుర్తించారు.
పురుగుల మందు తాగి రైతు ఆత్మహత్య
TAGGED:
అనంతపురం జిల్లా తాజా వార్తలు