ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Electric shock: విద్యుదాఘాతంతో యువరైతు మృతి - అనంతపురం తాజా వార్తలు

విద్యుదాఘాతంతో యువరైతు కరెంట్​ స్తంభంపైనే మృతి చెందిన ఘటన అనంతపురం జిల్లా యాడికి మండలం నగరూరులో చోటుచేసుకుంది. విద్యుత్ సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే రైతు మృతి చెందాడని బంధువులు ఆరోపిస్తున్నారు.

విద్యుదాఘాతంతో యువరైతు మృతి
విద్యుదాఘాతంతో యువరైతు మృతి

By

Published : Jul 1, 2021, 6:44 PM IST

అనంతపురం జిల్లా యూడికి మండలం నగరూరుకు చెందిన యువరైతు రమణారెడ్డి(28) విద్యుదాఘాతంతో మృతి చెందాడు.రమణా రెడ్డికి 15 ఎకరాల భూమి ఉంది. అందులో 5 బోరు బావులు ఉన్నాయి. ఆ బోరు బావుల కింద అరటి, కుసుమ పంటలు సాగుచేస్తున్నాడు. తన పోలంలో కరెంట్ స్తంభంపై మరమ్మత్తుల కారణంగా ఎల్సీ కావాలని లైన్​మెన్​ను సంప్రదించాడు. ఆ తోటల సమీపంలోనే ఓ గుత్తేదారుడు కొత్త విద్యుత్ నియంత్రికల మార్పుకోసం ఎల్సీ తీసుకున్నాడు. విద్యుత్ సరఫరా నిలిపివేసినట్లు పని చేసుకోవచ్చని లైన్​మెన్ తెలపడంతో రమణారెడ్డి స్తంభం పైకి ఎక్కి మరమ్మత్తులు చేపట్టాడు.

ఎల్సీ తీసుకున్న గుత్తేదారుడు తన పని పూర్తైందని చెప్పడంతో లైన్​మెన్ విద్యుత్​ని పునరుద్ధరించాడు. రమణారెడ్డి స్తంభంపై ఉండగానే విద్యుత్ సరఫరా జరగడంతో విద్యదాఘాతానికి గురై స్తంభంపైనే అతను మృతి చెందాడు. ఇది గమనించిన తోటి రైతులు విషయాన్ని విద్యుత్ అధికారులకు తెలియచేసి విద్యుత్ సరఫరాను నిలిపివేయించారు. అనంతరం రమణారెడ్డి మృతదేహాన్ని కిందికి దించారు. లైన్​మెన్ నిర్లక్ష్యంగా వ్యవహరించడంతోనే రమణారెడ్డి మృతి చెందాడంటూ బంధువులు..విద్యుత్ అధికారులతో వాగ్వాదానికి దిగారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి.. కేసు నమోదు చేసుకోని దర్యాప్తు చేపట్టారు.

ఇదీ చదవండి:

జల వివాదం.. ఇరు రాష్ట్రాల అధికారుల సమావేశం

ABOUT THE AUTHOR

...view details