ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం... రైతు మృతి - అనంతపురంలో విద్యాదాఘాతంలో రైతు మృతి

పొలంలో నీరు పెట్టేందుకు.... ప్యూజు తగిలిస్తుండగా విద్యుదాఘాతంతో కృష్ణయ్య అనే రైతు అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన అనంతపురం జిల్లా భూపతివారి పల్లిలో జరిగింది.

విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం కారణంగా రైతు మృతి
విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం కారణంగా రైతు మృతి

By

Published : Dec 22, 2019, 10:04 AM IST

అనంతపురం జిల్లా తలుపుల మండలంలో విషాదం జరిగింది. భూపతివారి పల్లికి చెందిన రైతు కృష్ణయ్య తన పొలంలో... కరెంట్ షాక్ తగలి అక్కడిక్కడే మృతి చెందాడు.

ఇదీ జరిగింది
రైతు కృష్ణయ్య తన పొలంలో విద్యుత్ అధికారులతో కొత్తగా ట్రాన్స్​ఫార్మర్​ ఏర్పాటు చేసుకున్నాడు. కానీ ఫ్యూజ్ సదుపాయాలు ఏర్పాటు చేయలేదు. సమస్యపై రైతు అధికారుల దృష్టికి తీసుకెళ్లిన పట్టించుకోలేదని తానే... ఫ్యూజ్ తగిలిస్తుండగా...విద్యుదాఘాతానికి గురై అక్కడిక్కడే మృతి చెందాడని గ్రామస్తులు తెలిపారు. రైతు మృతికి విద్యుత్ సిబ్బంది నిర్లక్ష్యమే కారణని గ్రామస్థులు ఆరోపించారు.

విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం కారణంగా రైతు మృతి

ABOUT THE AUTHOR

...view details