ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jan 14, 2021, 7:58 PM IST

ETV Bharat / state

అప్పుల బాధ భరించలేక.. అన్నదాత ఆత్మహత్య

అప్పుల బాధ తట్టుకోలేక ఓ రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన అనంతపురం జిల్లా అమరాపురం మండలం గౌడనకుంట గ్రామంలో విషాదం నింపింది. వ్యవసాయ బోర్ల కోసం చేసిన అప్పు.. మరోపక్క వైద్య ఖర్చుల కోసం చేసిన అప్పులు అధికమై.. వాటిని తీర్చే దారి లేక ఆ రైతు ఆత్మహత్య చేసుకున్నట్లు స్థానికులు చెప్పారు.

farmer commit suicide with heavy debt ridden
అప్పుల బాధ భరించలేక రైతు ఆత్మహత్య..

అనంతపురం జిల్లా అమరాపురం మండలం గౌడనకుంట గ్రామంలో ఉగ్రప్ప అనే రైతు... తన పశువుల కొట్టంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తనకున్న నాలుగు ఎకరాల 80 సెంట్ల భూమిలో వ్యవసాయం చేసేందుకు రైతు ఉగ్రప్ప అప్పు చేసి మూడు బోర్లు వేయించాడు.

వీటితో పాటు తన అనారోగ్యానికి చికిత్స ఖర్చు నిమిత్తం.. 6 లక్షల 40 వేల రూపాయలు అప్పు చేశాడు. దిగుబడి లేక... అప్పు తీర్చలేక.. మరోపక్క అనారోగ్యంతో సతమతమై ఆత్మహత్య చేసుకున్నాడని స్థానికులు చెప్పారు. మృతుని భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details