అనంతపురం జిల్లా మడకశిర మండలం నీలకంఠాపురం గ్రామ సమీపంలో ఉన్న సొంత పొలంలో మాజీ మంత్రి రఘువీరారెడ్డి దంపతులు ఎద్దుల మడకతో తీగ వేరు శెనగ విత్తనాలు వేశారు. తీగ వేరుశెనగ కనుమరుగవుతున్న తరుణంలో అతికష్టం మీద ఓ రైతు నుంచి వీటిని సేకరించి సాగు చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ సందర్భంగా రైతు పండించిన ప్రతీ పంట అధిక దిగుబడి రావాలని రఘువీరారెడ్డి ఆకాంక్షించారు.
తీగ వేరుశెనగ విత్తనాలు విత్తిన మాజీ మంత్రి దంపతులు - peanuts sowed news update
మొన్నటి వరకు సొంత ట్రాక్టర్తో దుక్కి దున్ని వరి నాటిన మాజీ మంత్రి, పీసీసీ మాజీ అధ్యక్షుడు, కాంగ్రెస్ సీనియర్ నేత రఘువీరారెడ్డి దంపతులు ఖరీఫ్ సీజన్లో ఎద్దుల మడకతో తీగ వేరు శెనగ విత్తనాలు విత్తారు.
Breaking News
ఇవీ చూడండి..రామ్చరణ్ పెళ్లి రోజు సందర్భంగా ప్రత్యేక పూజలు